వెలగపూడి
శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం ముగిసింది. బీఏసీ భేటీకి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి , కురసాల కన్నబాబు, అనిల్కుమార్ యాదవ్, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. ఒక్క రోజు సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీతో పాటు మహిళలకు ప్రత్యేకంగా ఉప ప్రణాళికలు పొందుపరిచిన 2021–22 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ శాసనసభలో ప్రవేశపెట్టారు.