YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అర్చకుల వేతనాలకు బడ్జెట్ కేటాయింపులు హర్షణీయం స్వరూపానందేంద్ర స్వామి

అర్చకుల వేతనాలకు బడ్జెట్ కేటాయింపులు  హర్షణీయం స్వరూపానందేంద్ర స్వామి

విశాఖపట్నం
అర్చకుల వేతనాలను పెంచడమే కాకుండా పెంచిన వేతనాలను చెల్లించేందుకు వీలుగా బడ్జెట్ కేటాయింపులు జరపడం పట్ల విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్చకుల వేతనాల కోసం బడ్జెట్లో రూ. 120 కోట్ల కేటాయింపులు జరపడంపై స్వామీజీ స్పందించారు.  దశాబ్దాలుగా అర్చకుల వేతనాల కోసం పాలకులెవరూ పట్టించుకోలేదని తెలిపారు. మ్యానిఫెస్టోలో ఉంచినా అర్చకుల వేతనాలను పెంచాలన్న ఆలోచనను  నిర్లక్ష్యం చేసారని అన్నారు. జీతాలను పెంచడమే గాకుండా తదనుగుణంగా బడ్జెట్లో నిధులు కేటాయించడం పట్ల ఆనందం వ్యక్తం చేసారు. అర్చకుల జీవితాల్లో వెలుగులు నింపిన  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభినందనీయుడని అన్నారు. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న అర్చకులకు ప్రభుత్వ నిర్ణయం దోహదపడుతుందని తెలిపారు. రిషికేశ్ లో ఉన్న మేము ఈ వార్త విని ఎంతో ఆనందించమని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉంటాయని స్వరూపానందేంద్ర స్వామి అన్నారు.

Related Posts