అమరావతి మే 20, ప్రాణం విలువ నాకు బాగా తెలుసు.. సీఎం జగన్ కొంతమంది వాస్తవాలు తెలిసి కూడా వక్రీకరిస్తున్నారు అందుకే ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం మొత్తం రూ.లక్షా 25 వేలకోట్లు ప్రజలకు చేరవేశాం:
గడిచిన 14 నెలల్లో కోవిడ్ నియంత్రణకు రూ.2,229 కోట్లు కొంతమంది వాస్తవాలు తెలిసి కూడా వక్రీకరిస్తున్నారు సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రెండేళ్ల కాలంలో ప్రతీ కుటుంబానికి లబ్ది చేకూరేలా సంక్షేమ పాలన అందించామని పేర్కొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో సీఎం జగన్ గురువారం మాట్లాడుతూ... కోవిడ్ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారికి ఏపీ అసెంబ్లీ నివాళి అర్పిస్తోందన్నారు.‘‘మహానేత కోసం ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను ఓదార్పుయాత్రతో పరామర్శించా. నాకు ప్రాణం విలువ బాగా తెలుసు. అందుకే ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ఫోన్ చేసిన 20 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చేలా మార్పులు చేశాం. ప్రతి 2 వేలమంది జనాభాకు ఒక ఏఎన్ఎంను ఏర్పాటు చేశాం’’ అని తెలిపారు గడిచిన 14 నెలల్లో కోవిడ్ నియంత్రణకు రూ.2,229 కోట్లు
మహమ్మారి కరోనాపై పోరు గురించి సీఎం జగన్ మాట్లాడుతూ... ‘‘కోవిడ్ రోగుల కోసం 47 వేల బెడ్లను అందుబాటులోకి తీసుకొచ్చాం . కోవిడ్ కేర్ సెంటర్లలోనూ 52 వేల బెడ్లను అందుబాటులోకి తెచ్చాం.18 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందుబాటులోకి తెస్తున్నాం. కోవిడ్ను ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచిత వైద్యం అందిస్తున్నాం. గడిచిన 14 నెలల్లో కోవిడ్ నియంత్రణకు రూ.2,229 కోట్లు కేటాయించాం. కోవిడ్ సమాచారం కోసం 104ను అందుబాటులోకి తెచ్చాం. ఇప్పటివరకు 3.12 లక్షలమంది 104 సేవలు వినియోగించుకున్నారు. 104 ద్వారా 60 వేలమందికిపైగా కోవిడ్ రోగులకు ఆస్పత్రుల్లో బెడ్లు ఏర్పాటు చేశాం. టెలీమెడిసిన్ ద్వారా 3,991 మంది వైద్యులు సేవలు అందిస్తున్నారు. విదేశాల నుంచి ఆక్సిజన్ను దిగుమతి చేసుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు.
సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
*బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాం. దీని చికిత్స కోసం 17 ఆస్పత్రులను నోటిఫై చేశాం
*టీచింగ్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ జనరేటర్లు ఏర్పాటు చేస్తాం. 50 ఆక్సిజన్ ట్యాంకర్లను కొనుగోలు చేశాం
*నర్సులు, డాక్టర్లు, హెల్త్ వర్కర్లు, అధికారుల కృషి వల్ల.. మరణాల రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మనమూ ఉన్నాం
*కోవిడ్ కేసులను వెంటనే గుర్తించి వేగంగా వైద్యం అందించడం ద్వారానే మరణాల రేటును తగ్గించగలుగుతున్నాం
*దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేయాలంటే.. 172 కోట్ల వ్యాక్సిన్ డోసులు అవసరం. కానీ దేశంలో నెలకు 7 కోట్ల డోసుల ఉత్పత్తికి మాత్రమే సామర్థ్యం ఉంది. ఇక దేశంలో ఇప్పటివరకు 18.44 కోట్ల మందికి మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తైంది
*రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్ వేయాలంటే.. 7 కోట్ల డోసులు అవసరం ఉంది
*వ్యాక్సిన్ కోటా కేటాయింపు ప్రక్రియ పూర్తిగా కేంద్రం నియంత్రణలో ఉంది
కొంతమంది వాస్తవాలు తెలిసి కూడా వక్రీకరిస్తున్నారు
భారత్ బయోటెక్ స్వయంగా రామోజీరావు కుమారుడి వియ్యంకుడిదే. ఆ కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం ఎంతో వారికి తెలియదా? అయినా అన్నీ తెలిసి కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వ్యాక్సిన్ల కోసం ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను కూడా పిలిచింది. వ్యాక్సిన్లు ఎలాగైనా తెస్తాం.. ప్రజలకు ఉచితంగా ఇస్తా మన్నారు.‘‘మనం నాలుగు బిల్డింగ్లు కడితే అభివృద్ధి జరిగినట్లు కాదు. నిన్నటికంటే ఈరోజు బాగుండాలి. రేపు మరింత బాగుంటుందనే భరోసా కల్పించాలి. నాడు-నేడు ద్వారా విద్యావ్యవస్థ రూపురేఖలు మారుస్తున్నాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళా సాధికారతపై దృష్టి పెట్టాం. రాష్ట్రంలో 62 శాతంమంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. వారి బతుకులు మార్చకుండా అభివృద్ధి ఎలా సాధ్యం. విత్తనం దగ్గర నుంచి పంట అమ్మకం వరకు రైతులకు తోడుగా ఉంటున్నాం.కుట్రలు పన్ని గోడలపై ఉన్న రంగులు తుడిచివేయగలిగారు గానీ.. ప్రజల గుండెల్లో రంగులను తాకలేకపోయారు. పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్, తిరుపతి ఉపఎన్నిక సహాఏ ఎన్నిక వచ్చినా దేవుడి దయతో ఒకే జెండా ఎగిరింది. గత 23 నెలల్లో ప్రజలకు నేరుగా రూ.93,708 కోట్లు అందించాం. మరో రూ.31,714 కోట్లు ప్రజలకు పరోక్షంగా అందించాం. మొత్తం రూ.లక్షా 25 వేలకోట్లు ప్రజలకు చేరవేశాం. మనం ప్రజలకు సేవకులమని గుర్తుపెట్టుకుని పనిచేయాలి’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.