YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఈనెల 25న బంగాళాఖాతంలో తుఫాను నేవీ హెచ్చరిక

ఈనెల 25న బంగాళాఖాతంలో తుఫాను నేవీ హెచ్చరిక

విశాఖపట్నం
ఈ నెల 25న బంగాళాఖాతంలో తుఫా ను ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనా వస్తోంది.దీనికి ‘యాస్’ అని పేరు పెట్టారు.ఇది వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమబెంగాల్, ఒడిశా వైపు దూసుకు వస్తుందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ నెల 26న పశ్చిమ బెంగాల్, ఒడిశా మధ్య తీరం దాటుతుందని అంచనా వేసింది.హిందు మహా సముద్రంలో ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని తుపాను ఆవర్తనం ఏర్పడింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈనెల 23 నాటికి అల్పపీడనం ఏర్పడగలదని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దింతో ఇండియన్ కోస్ట్ గార్డ్ తూర్పు తీరంలో విస్తృతమైన ముందస్తు చర్యలను ప్రారంభించింది.వేటకు వెళ్లిన మత్స్యకారులను అప్రమత్తం చేస్తూ వారిని తిరిగి వెళ్లాలని నేవీ అధికారులు సూచించారు.

Related Posts