ఉయ్యూరు
దళిత డాక్టర్ సుధాకర్ గుండె పోటు మరణం ముమ్మాటికీ జగన్ ప్రభుత్వ హత్యేనని ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. మాస్కులు లేవని ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపిన కారణంగా నడిరోడ్డు పై చేతులు వెనక్కి విరిచి కొట్టించి, పిచ్చోడని ముద్రవేసి సస్పెండ్ చేశారు. సంవత్సర కాలంగా ఆ మానసిక వ్యధతోనే డా,, సుధాకర్ కృంగి పోయి గుండె పోటుతో చనిపోవడం జరిగింది. జగన్ ప్రభుత్వ అరాచకాల్ని ఎవరైనా ప్రశ్నించినా, వైఫల్యాల్ని ఎత్తి చూపిన కక్ష కట్టి వేధిస్తున్నారు. వైసీపీ పాలన చూస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బ్రతికే ఉందా అని అనుమానం కలుగుతుంది. ప్రభుత్వం వెంటనే దళిత డా,, సుధాకర్ కుటుంబానికి కోటి రూపాయలు ఆర్థిక చేసి మీరు చేసిన తప్పు కొంతైనా సరిచేసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అయన అన్నారు.