నెల్లూరు
కృష్ణపట్నం లో కరొనాకు ఆనందయ్య మందు ఇస్తున్నాడని ఆ ఆ కుటుంబం తరతరాల్నుంచి ఆయుర్వేదిక్ మందులు అందిస్తున్నారని పాముకాటు తేలుకాటుకు కూడా మందు ఇచ్చి బాగుచేశారని గ్రామస్తులు ఉదయ భాస్కర్ అన్నారు .శనివారం నెల్లూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం నుంచి కరోనా మందు ఇవ్వడం జరుగుతుందని గ్రామంలో ఎవ్వరికీ కరోనా రాలేదన్నారు .ఈ సంవత్సరం అరవై వేల మంది వరకూ మందు ఇవ్వడం జరిగిందన్నారు. శాసన సభ్యుడు గోవర్ధన్ రెడ్డి సహకారంతోనే అందరికీ మందు అందిస్తున్నామని అయనకు కృతజ్ఞతలు తెలిపారు. శాసనసభ్యులు ప్రతి నిముషమూ మందును అందరికీ అందించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు .ఎలాంటి సమస్య వచ్చినా మందును ఆపడం జరగదని ప్రజలందరికీ అందిస్తామని గోవర్ధన్ రెడ్డి హామీ ఇచ్చారని వారు పేర్కొన్నారు. విలేఖర్ల సమావేశంలో సుమంత్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు .