YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సిపిఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డి. టి కి వినతి పత్రం.

సిపిఐ,  ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డి. టి కి   వినతి పత్రం.

ప్రకాశం జిల్లా దర్శి మండలం లో ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ పథకం ద్వారా సుమారు 13వేల మంది ఉపాధి హామీ పథకం ద్వారా జాబ్ కార్డులు కలిగి ఉన్నారని వారిలో దర్శి పట్టణమునకు చెందిన వారు సుమారు 270 గ్రూపులలో మూడు వేల మంది కూలీలు ఉన్నారని వారికి తక్షణమే ఉపాధి హామీ పథకం పనులను అమలు చేయాలని దర్శి తహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. దర్శి పట్టణమును 2020 వ సంవత్సరంలో మున్సిపాలిటీగా చేయడం వల్ల కూలి పనుల పై జీవనం కొనసాగిస్తున్నా సుమారు 150 కుటుంబాలు అర్థాకలితో జీవనం గడుపుతున్నారు అని తక్షణమే వారిని ఆదుకోవాలని ప్రజాసంఘాల నాయకులు జూపల్లి కోటేశ్వరరావు కోరారు. దర్శి నగర పంచాయతీ గా మారిన అప్పటి నుండి ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా పనులు సరిగ్గా కల్పించడం లేదని వెంటనే వాటిని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. సుమారు 270 గ్రూపులలో 150 పైగా కుటుంబాలవారు రెక్కాడితే గాని డొక్కాడని స్థితిలో ఉన్న అటువంటి వారిపై ఉపాధి హామీ పనులు వలన వారి ఆర్థిక పరిస్థితి దుర్భరం అయిందని తెలిపారు. దర్శి నగర పంచాయతీ పరిధిలోని శివరాజ్ నగర్, సాయి నగర్, ఏకలవ్య నగర్, శాంతినగర్, పుచ్చల మెట్ల వారు అధికంగా ఉన్నారని వారికి పనులు లేని సమయంలో నిరుద్యోగ భృతి ని కూడా కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేత రమేష్ బాబు, ఆంగ్రూ టైం స్కేల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జూపల్లి కోటేశ్వరరావు, సిపిఐ నాయకురాలు సి. హెచ్. అరుణ, నరసింహం, వి.  వెంకటేశ్వర్లు, ఎం. సుశీల, సావిత్రమ్మ తదితరులు   పాల్గొన్నారు.  

Related Posts