YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నెరవేరబోతున్న పేదల సొంతింటి కల...

నెరవేరబోతున్న పేదల సొంతింటి కల...

విజయవాడ,   ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ముక్త్యాల గ్రామంలో నిర్మిస్తున్న ఇళ్ళ నిర్మాణ పనులు పరిశీలన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదల సొంతిం టి కల నెరవేరబోతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసన సభ్యులు సామినేని ఉదయభాను  తెలియజేశారు. జగ్గయ్యపేట మండలంలోని ముక్త్యాల గ్రామంలో వైఎస్ఆర్ – జగనన్న కాలనీల్లో నూతనంగా నిర్మిస్తున్న ఇళ్ళ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ – జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పించే విషయంలో అధికారులు ఎక్కడా రాజీపడకూడదని తెలిపారు. పేదల కోసం పెద్ద ఎత్తున నిర్మిస్తున్న ఇళ్లకు సంబంధించిన వైఎస్ఆర్ – జగనన్న కాలనీల్లో తొలిదశలో 8,679 లే అవుట్లలో 920 కోట్లతో నీటిసరఫరా పనులను ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. తొలిదశలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 8,905 లే అవుట్లలో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నార న్నారు. అనంతరం ముక్త్యాల గ్రామంలో వైఎస్ఆర్ - జగనన్న కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి బోరు ను ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ప్రారంభించారు.

Related Posts