గుంటూరు
సంగం డెయిరీ కేసులో తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు బెయిల్ మంజూరైంది. నరేంద్రతో పాటు సంగం డెయిరీ ఎండీ గోపాల్కృష్ణన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు, ఈరోజు వారికి బెయిల్ మంజూరు చేసింది. నాలుడు వారాల పాటు విజయవాడ మున్సిపల్ పరిధిలోనే ఉండాలని, నివాసముంటున్న స్థలం చిరునామాను విచారణాధికారికి ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. విచారణకు 24 గంటల ముందు విచారణాధికారి నోటీసు ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది.