YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

డాక్టర్ సుధాకర్ పై ప్రభుత్వం కక్ష కట్టింది

డాక్టర్ సుధాకర్ పై ప్రభుత్వం కక్ష కట్టింది

విశాఖపట్నం
విశాఖలో టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. ఇటీవల కాలంలో మృతి చెందిన డాక్టర్ సుధాకర్ కుటుంబ సభ్యులు లోకేష్, టిడిపి నేతలు పరామర్శించారు. సుధాకర్ కుటుంబ సభ్యులను ఓదార్చిన లోకేష్ ... ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని,రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని ఎద్దెవ చేశారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదని,దళిత డాక్టర్ సుధాకర్ మృతి ప్రభుత్వ హత్యేనని ఆరోపించిన లోకేష్ ... డాక్టర్ సుధాకర్ మాస్క్ ఇవ్వమని అడిగినందుకు ప్రభుత్వం కక్ష కట్టిందని విమర్శించారు.సుధాకర్ గారి విషయంలో ప్రభుత్వం,పోలీసులు వ్యవహరించిన తీరుని వివరిస్తూ తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత రాసిన లేఖను హై కోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించిందని,గాయాలు,ఆయన మానసిక స్థితి పై ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు నివేదికల పై ఆగ్రహం వ్యక్తం చేసిన హై కోర్టు సీబీఐ దర్యాప్తు కి ఆదేశించిందని గుర్తు చేశారు. అయినా ప్రభుత్వం సుధాకర్ పై కక్షసాదింపు చర్యలకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Posts