YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

బ్లాక్.. వైట్.. ఇప్పుడు యెల్లో ఫంగస్

బ్లాక్.. వైట్.. ఇప్పుడు యెల్లో ఫంగస్

ముంబై, మే 24, 
దేశంలో కరోనాతోపాటుబ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కేసులతో సతమతమవుతుంటే మరో కొత్త ఫంగస్ వెలుగు చూసింది. యెల్లో ఫంగస్‌ను వైద్యులు గుర్తించారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ కేసు బయటపడింది. దీనిపై వైద్యులు పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఈ రకం ఫంగస్ బ్లాక్, వైట్ ఫంగస్ కంటే మరింత ప్రమాదకారని భావిస్తున్నారు. బద్దకం, బరువు తగ్గడం, తక్కువ ఆకలి లేదా ఆకలి లేకపోవడం వంటివి ఈ వైరస్ లక్షణాలని వైద్య నిపుణులు పేర్కొన్నారు. యెల్లో ఫంగస్ వల్ల శరీరంలో చీము కారడం వంటి లక్షణాలు ఉంటాయి.అంతేకాదు, ఈ ఫంగస్ వల్ల శరీరానికి ఏర్పడిన గాయాలు నెమ్మదిగా తగ్గుతాయని, కంటిచూపు కోల్పోవడం, అవయవాలు పనిచేయకపోవడం, క్రమంగా శరీర కణాలు నశిస్తాయి. యెల్లో ఫంగస్ ప్రాణాంతకమని ఎందుకంటే అంతర్గతంగా అవయవాలను దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరించారు. యెల్లో ఫంగస్ లక్షణాలు బయటపడితే తక్షణమే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. దీనికి యాంటీ-ఫంగల్ డ్రగ్ ఆంఫోటెరిసిన్‌-బిను వినియోగించాలని తెలిపారు.తక్కువ పరిశుభ్రత యెల్లో ఫంగస్ సంక్రమణకు కారణమవుతుంది.. ఎక్కువ రోజులు నిల్వ ఉన్న ఆహారం, మలం నుంచి కూడా వ్యాప్తికి సహాయపడుతుంది. బ్యాక్టీరియా, ఫంగస్ విస్తరణను ప్రోత్సహిస్తున్నందున ఎక్కువ తేమ కూడా సంక్రమణకు దారితీస్తుంది. తేమ 30% నుంచి 40% మధ్య ఉంటే ముప్పు ఉంటుంది. ఇదిలా ఉండగా, ఇప్పటి వరకూ దేశంలోని 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 5,424 మ్యూకోర్‌మైకోసిస్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించారు.వీరిలో 4,556 మంది కోవిడ్ సోకిన బాధితులు కాగా.. 55 శాతం మంది డయాబెటిస్ బాధితులు. అయితే, శనివారం కేంద్ర మంత్రి సదానంద గౌడ చేసిన ప్రకటన భిన్నంగా ఈ సంఖ్య ఉండటం గమనార్హం. మే 21 నాటికి దేశవ్యాప్తంగా 8,848 బ్లాక్‌ ఫంగస్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. అత్యధికంగా గుజరాత్‌లో 2,281 మందికి ఈ వ్యాధి బారినపడ్డారు. తర్వాతి మహారాష్ట్రలో 2,000, ఆంధ్రప్రదేశ్‌లో 910 కేసులు బయటపడినట్టు పేర్కొంది. దేశంలోని మొత్తం కేసుల్లో ఈ మూడు రాష్ట్రాల వాటా 58.66 శాతంగా ఉందని వివరించింది.

Related Posts