YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ తిరిగి ప్రారంభం

వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ తిరిగి ప్రారంభం

కడప జూన్ 7
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సుమారు ఏడు నెలల తర్వాత విచారణ తిరిగి ప్రారంభమయ్యింది. కేసు విచారణ నిమిత్తం ఆరుగురితో కూడిన సీబీఐ అధికారుల బృంధం ఇప్పటికే కడప కేంద్ర కారాగారం అతిథిగృహానికి చేరుకున్నది. రెండేళ్ల క్రితం జరిగిన వివేకానందరెడ్డి హత్య కేసులో పలువురిని విచారించిన సీబీఐ.. గతేడాది కొందరిని విచారించింది. అయితే విచారణకు వచ్చిన అధికారుల్లో కొందరు కరోనా బారినపడ్డారు. దీంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఏడు నెలల తరువాత మళ్లీ విచారణ జరిపేందుకు అధికారులు వచ్చారు. ఇదివరకే ప్రశ్నించిన వ్యక్తులకు నోటీసులు జారీ చేసిన అధికారులు.. మరోసారి కేసులోని కీలక వ్యక్తులను విచారించనున్నారు.

Related Posts