హైదరాబాద్ జూన్ 8
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మంత్రి జగదీశ్ రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యంగ్యంగా ఆయన చేసిన ట్వీట్ నెట్టింట సరికొత్త చర్చకు దారితీసింది. ఓ పత్రికా కథనాన్ని ఆధారం చేసుకుని.. మంత్రి జగదీశ్రెడ్డిపై రేవంత్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ‘రస’కందాయంలో హంపి ‘ధూమ్ధామ్’... కోవర్ట్ ‘క్రాంతి’ కిరణాలతో కకావికలం... యముడు జగదీశ్ రెడ్డి ‘ఘంటా’ కొట్టినట్టేనా...? అంటూ ఆ ట్వీట్ సాగింది. ఈ ట్వీట్ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, క్రాంతి కిరణ్, మంత్రి జగదీశ్రెడ్డిలను ఉద్దేశిస్తూ చేసినట్టుగా నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. త్వరలో టీఆర్ఎస్ పార్టీ మరో సంచలనానికి వేదిక కాబోతోందనడానికి ఈ ట్వీట్ సూచిక అంటున్నారు.