YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైసీపీ పాలనలో పోలీసుల తీరు, నిరంకుశ పాలకుల ప్రైవేటు సైన్యంల ఉంది... గవర్నర్ టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

వైసీపీ పాలనలో పోలీసుల తీరు, నిరంకుశ పాలకుల ప్రైవేటు సైన్యంల ఉంది... గవర్నర్ టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

అమరావతి జూన్ 8
 రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనితీరును ఎండగడుతూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. విశాఖలో నడిరోడ్డుపై దళిత యువతి లక్ష్మీ అపర్ణను పోలీసులు అడ్డుకున్న తీరును ప్రస్తావిస్తూ.. ప్రజల హక్కులను హరిస్తున్న వైనాన్ని వివరించారు. లేఖలో ఆయనేమన్నారంటే.. ‘‘ప్రస్తుత కరోనా కారణంగా ప్రజలు అనేక కష్టాల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆదుకునే ప్రభుత్వము, స్నేహ హస్తం అందించే పోలీసులు ప్రజలకు కావాలి. కానీ విశాఖలో మొన్న లక్ష్మీ అపర్ణ అనే దళిత యువతి, అంతేకాకుండా ఒక కోవిడ్ ఫ్రంట్ లైన్ వర్కర్ పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణంగా ఉంది. ప్రస్తుత వైసీపీ పాలనలో కొందరు పోలీసుల తీరు, నిరంకుశ పాలకుల ప్రైవేటు సైన్యమన్నట్టుగా ఉంటోంది. ప్రజల హక్కులను హరిస్తోంది. కాబట్టి ఒక రాష్ట్రాధిపతిగా వ్యవస్థను చక్కదిద్దే దిశగా ఈ విషయంలో చొరవతీసుకోవాలి’’ అని కోరారు.

Related Posts