YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

పులివెందులలో తుపాకీ కాల్పులు…ఇద్దరు మృతి

పులివెందులలో తుపాకీ కాల్పులు…ఇద్దరు మృతి

కడప
కడప జిల్లా పులివెందుల మండలం నల్లపురెడ్డి పల్లి గ్రామంలో మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో వైసిపి కి చెందిన రెండు కుటుంబాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో జరిగిన తుపాకీ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.   పార్థసారధి రెడ్డి (48), ప్రసాద్ రెడ్డి ( 62 ) ఇరువురు బంధువులు. వీరి కుటుంబాల మధ్య పాత కక్షలు ఉన్నాయి.  ఉదయం ప్రసాద్ రెడ్డి  ఇంటి పైకి మచ్చు కత్తి తీసుకొని  పార్థసారధి రెడ్డి దాడి చేయబోయాడు.   నన్ను చంపుతా డెమో అన్న ఆందోళనతో ప్రసాద్ రెడ్డి ( కాబోయే మండలాధ్యక్షుడు) తన దగ్గర ఉన్న లైసెన్స్  తుపాకీతో  పార్థసారధి రెడ్డి పై రెడ్డిపై కాల్పులు జరిపాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. .అనంతరం అదే తుపాకితో  ప్రసాద్ రెడ్డి  కూడా తన లైసెన్సు రివాల్వర్ తో ఆయనే కాల్చుకొని మృతి చెందాడు.  ప్రస్తుతం పోలీసులు గ్రామంలో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు.

Related Posts