YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నవ్యాంధ్రప్రదేశ్ ను అరాచకాంధ్రప్రదేశ్ గా మారుస్తున్న జగన్ రెడ్డి కింజారపు అచ్చెన్నాయుడు

నవ్యాంధ్రప్రదేశ్ ను అరాచకాంధ్రప్రదేశ్ గా మారుస్తున్న జగన్ రెడ్డి కింజారపు అచ్చెన్నాయుడు

విజయవాడ
నవ్యాంధ్రప్రదేశ్ ను అరాచకాంధ్రప్రదేశ్ గా జగన్ రెడ్డి మారుస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు   ఆరోపించారు.  అభివృద్ధి పథంలో ముందుంచాల్సిన రాష్ట్రాన్ని అరాచకాలు, అకృత్యాలు, అన్యాయాల్లో ముందంజలో ఉంచారు. రెండేళ్ల జగన్ రెడ్డి పాలనలో కక్షసాధింపు చర్యలు తప్పా ప్రజలు చేసింది ఏమీ లేదని అయన అన్నారు. అమరావతి మండలం ఉంగుటూరు గ్రామంలో సర్పంచ్ భర్త సోమశేఖర్ పై వైసీపీ నాయకులు మారణాయుధాలతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. రెండు నెలల్లో ఆరు సార్లు దాడి జరిగినా ఇంత వరకు ఎందుకు కేసు నమోదు చేయలేదు?  సర్పంచ్ గా గెలిచిన నాయకులను అభివృద్ది పనులు చేస్తే దాడులు చేస్తారా? దాడికి పాల్పడిన రాయపాటి శివ వెంటనే అరెస్ట్ చేయాలి. అతనిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలి.   ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న జిల్లాలో హోం మంత్రి సొంత జిల్లాలో ఇలాంటి దాడులు జరగటం సిగ్గుచేటు. 24 గంటల్లో దోషులను అరెస్టు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రోజు ఏదో ఒక చోట దాడులు, దౌర్జన్యాలకు వైసీపీ నాయకులు తెగపడటం జగన్ రెడ్డి ఫ్యాక్షనిస్టు పాలనకు సాక్షీభూతంగా నిలుస్తున్నాయి. రాజధానిని కాపాడుకోవడానికి అమరావతి ప్రజలు చేస్తున్న పోరాటాన్ని నీరుగార్చేందుకు జగన్ రెడ్డి దాడులకు పాల్పడం దౌర్బాగ్యమని అయన అన్నారు.
ప్రతిపక్ష పార్టీ నాయకులపై ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా దెబ్బతీసి ప్రతిపక్ష పార్టీని అణచివేసేందుకు కుట్ర చేయడం సిగ్గుచేటు. జగన్ రెడ్డి తలకిందులు తపస్సు చేసినా టీడీపీని ఏమీ చేయలేరు. ప్రజల హృదయాల్లో, కార్యకర్తల గుండెల్లో చంద్రబాబు నాయుడు కోసం గూడుకట్టుకున్న అభిమానాన్ని చెరపలేరని అయన అన్నారు.

Related Posts