YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పట్నంలో ఏనుగులు

పట్నంలో ఏనుగులు

చిత్తూరు
చిత్తూరు జిల్లా పలమనేరు లో పట్టపగలే టౌన్ సమీపంలో 15 ఏనుగుల గుంపు తిరుగడం కలకలం రేపింది. బుధవారం ఉదయం పలమనేరు టౌన్ లోని  రాధా బంగ్లా  సమీపంలో   సుమారు 15 ఏనుగులు ఇళ్ల మధ్యలో నుంచి రోడ్డు దాటాయి. దాంతో స్థానికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. అడవుల్లో ఏనుగులను చూసాం. రోడ్లు దాటుతుంటడా చూసాం. ఇప్పుడు టౌన్ లో చూస్తున్నామని అంటున్నారు.  ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతకాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. ఇంత జరుగుతున్న అటవీశాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, రాత్రి వేళ పలమనేరు పట్టణంలోకి ప్రవేశించిన ఏనుగుల గుంపు రాత్రంతా కురప్పపల్లి, రామాపురం ప్రాంతంలోని పంట పొల్లాలోకి దిగాయి. పలమనేరు పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోని రాధా బంగ్లా, మిషన్ స్కూల్ కాంపౌండ్ ప్రాంతంలో బీభత్సం సృష్టించాయి. పెద్ద సంఖ్యలో ఏనుగు లు ప్రవేశించడంలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అటవీశాఖ అధికారులు తక్షణమే స్పందించి ఏనుగుల గుంపు నుంచి తమను రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.

Related Posts