YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కక్షా రాజకీయాలు చేస్తే ప్రజలు ఊరుకోరు

కక్షా రాజకీయాలు చేస్తే ప్రజలు ఊరుకోరు

కక్షా రాజకీయాలు చేస్తే ప్రజలు ఊరుకోరు
గుంటూరు
పోన్నూరు నియోజకవర్గం చింతలపూడిలో మాజీ ఎమ్మెల్యే నరేంద్ర నివాసంల నుండి  చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు.  సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నరేంద్రి. దూళిపాళ్ల వీరయ్య చౌదరి, ఇప్పుడు నరేంద్ర ఇక్కడి ప్రజలకు, సంగండైరీ రైతాంగానికి అండగా ఉంటున్నారని అన్నారు.వరుసగా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు ఎనలేని సేవలు అందించారు. రైతుల కోసం నిరంతరం కృషి చేసిన కుటుంబం నరేంద్రాది. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి నా నలబై సంవత్సరాల రాజకీయ జీవితంలో చూడలేదు. విలువలు లేని కక్షా రాజకీయాలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. సంగం, విశాఖ డైరీలు చట్ట ప్రకారం బదిలీ అయ్యాయని అన్నారు.సంగండైరీ ఆధ్వర్యంలో ఒక హస్పిటల్ పెట్టి డైరీ రైతులకు సేవలు అందిస్తున్నారు. అలాంటిది రాజకీయ కక్షతో ఏ తప్పు చేయకుండా ముందస్తు నోటీసులు లేకుండా నరేంద్రాని అరెస్ట్ చేశారు. చట్టాన్ని ఉల్లంఘించి పని చేసే అధికారులు  భౌవిష్యత్ లో ముల్యం చెల్లించుకోంటారు. ఈ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించే అచ్చెన్నాయుడు, నరేంద్ర వంటి వారిని అరెస్టు చేసి ప్రజలను డైవర్స్  చేస్తున్నారు.
టీడీపీలో వైసీపీ నేతల్లాగా తప్పుడు మనుషులు లేరు. 43వేల కోట్ల రూపాయల అవినీతి చేసి.... ఈడీ ముద్దాయిగా ఉన్న వ్యక్తి జగన్. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చేస్తున్న అవినీతి కి కోర్టు లు కూడా చాలవు. నరేంద్ర  ఆస్తులు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు గడిచిన 10సంవత్సరాలలో ఎంత శాతం పెరిగాయో ప్రజలు చూడాలి. దర్మం కోసం ప్రజా వ్యతిరేక విధానాలపై నరేంద్ర పోరాటం చేస్తున్నారు. నరేంద్రాని బెదిరించారు చివరికి అరెస్ట్ చేశారని అన్నారు.ప్రభుత్వం ఇలాగే ముందుకు వెళితే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయి. సోషల్ మీడియా కేసులో అరెస్ట్ చేయవద్దని సుప్రీం చెప్పినా వీళ్లు అరెస్ట్ చేస్తున్నారు. ఉన్మాది పాలలో పోలీసులు కూడా అలాగే తయారయ్యారు. రెండున్నర సంవత్సరాలు పూర్తయ్యాయి... ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారు అలాంటి వారిని వదిలిపెట్టం. రాయలసీమలో గతంలో ఉన్నా హత్యా రాజకీయాలు, ముఠా కక్షలకు చరమగీతం పాడాం. అలాంటిది మళ్ళీ ఈ ప్రభుత్వం వాటిని ప్రోత్సహిస్తుందని ఆరోపించారు.
గతంలో మేము ఇదే విధంగా చేస్తే మీరు ఈ రోజు అధికారంలో ఉండేవారా...? ఈ ప్రభుత్వం సర్పంచ్ అధికారాలను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. దీనిపై ప్రభుత్వానికి కోర్టు అక్షింతలు పడ్డాయి. స్థానిక సంస్థలు బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్రం నరేగా నిధులు నేరుగా పంచాయతీలకు ఇస్తున్నారు. కేంద్రం నుండి నిధులు వస్తున్నాయి కాబట్టి కేంద్రం ఏపీలో వాళ్ల సచివాలయం పెడితే ఊరుకోంటారా..? సర్పంచ్ లు రాజకీయాలకు అతీతంగా మీ హక్కులను కాపాడుకోవాలి. ఈ సీఎం వ్యవస్థను ఇష్టానుసారంగా నిర్వీర్యం చేశారు.  ఐయేఎస్, ఐసీఎస్  లను సైతం నిర్వీర్యం చేసారు. ఇప్పుడు సర్పంచ్ లపై పడ్డారు. ఫైనాన్స్ కమీషన్ నేరుగా పంచాయతీలకి నిధులను ఇస్తుందని అయన అన్నారు.

Related Posts