గొర్రెలు కాపరికి నాలుగు లక్షల ఎల్వోసి చెక్కు అందజేత
మేడిపల్లి జులై 16
మేడిపల్లి మండలంలోని దేశాయిపేట గ్రామానికి చెందిన గొర్రెల కాపరి మేకల నర్సయ్య వెన్నుముక సమస్యతో బాధపడుతూ అనారోగ్య కారణంగా నిమ్స్ లో చేరగా వైద్యం కోసం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ని ఆశ్రయించగా, వెంటనే మంత్రి స్పందించి నాలుగు లక్షల ఎల్వోసి చెక్కును బాధితుని తండ్రి దుర్గయ్య కు అందజేశారు.అలాగే తక్షణ సహాయం కింద పదివేల రూపాయలు మంత్రి ఆర్థిక సహాయం అందించారు .ఈ సందర్భంగా
తమ కష్టకాలంలో స్పందించి, సహకారం అందించిన మంత్రి కొప్పుల ఈశ్వర్, వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు చెన్నమానేని రమేష్ బాబు, జిల్లా పరిషత్ వైఎస్ చైర్మన్ హరి చరణ్ రావు లకు మేకల నరేష్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రి తోపాటు, జిల్లా పరిషత్ వైఎస్ చైర్మన్ హరి చరణ్ రావు తదితరులు పాల్గొన్నారు.