హైదరాబాద్ జూలై 18
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి సోమేశ్ సోమేశ్ కుమార్ ఏపీ కేడర్ వ్యక్తి అని టిపిసిసి అద్యక్షులు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. సోమేశ్ ఏపీకి వెళ్లాలని క్యాట్ తీర్పు ఇచ్చినా ఆయనను సీఎం కేసీఆర్ సీఎస్గా కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఈ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీపై 298 కంటెమ్ట్ ఆఫ్ కోర్టులున్నాయి. ఏపీకి కేడర్కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ సోమేశ్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్నప్పుడు 8 సంవత్సరాలు సర్వీస్ వదిలేసి ప్రైవేటు కంపెనీల్లో పని చేశారు. ఆ 8 సంవత్సరాలను సర్వీస్లో తొలగిస్తే ఆయనకు ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా ఇవ్వడానికి కూడా చట్టం అనుమతించదు. అలాంటి సోమేశ్ కుమార్ను సీఎం కేసీఆర్ చీఫ్ సెక్రటరీని చేశాడని అన్నారు.