అమరావతి
ఛలో అమరావతి కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ ఇంటి ముట్టడికి నిరుద్యోగ సంఘాల నేతలు, కార్యకర్తలు ప్రయత్నించడంతో తాడేపల్లిలో సోమవారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. సీఎం నివాస సమీపానికి టిడిపి, వామపక్షాలకు చెందిన విద్యార్థి యువత నేతలు వచ్చారు. ఉదయం నుంచి సీఎం ఇంటి వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసారు. పోలీసులు అందోళనకారులును పలు చోట్ల అడ్డుకున్నారు. అయినా, పోలీసుల వలయాన్ని చేదించుకుని.. సీఎం నివాసం వద్దకు వారు చేరుకున్నారు. తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు ఆధ్వర్యంలో సీఎం నివాసం వరకు నిరుద్యోగులు చేరుకున్నారు.