గుంటూరు
కోటివేల్పుల అండ కోటప్పకొండ త్రికూటాద్రి పర్వతంపై తొలి ఏకాదశి పండుగ సందర్భంగా త్రికూటేశ్వర స్వామికి ప్రత్యేక పూజ ద్రవ్యములతో అభిషేకాలు నిర్వహించారు. అభిషేక మండపంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. త్రికోటేశ్వర స్వామి మూల విరాట్ కు ప్రత్యేక పూలతో అలంకరించారు దేవాలయం అంతా కూడా అత్యంత వైభవంగా శోభాయమానంగా ముస్తాబు చేశారు తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో త్రికోటేశ్వర స్వామి దర్శనానికి విచ్చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏర్పాట్లు చేశారు ఈవో అన్నపరెడ్డి రామకోటి రెడ్డి మరియు పాలకమండలి సభ్యులు ప్రత్యేక పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.తీర్థ ప్రసాదాలు వితరణ జరుగుతుంది. స్వచ్ఛంద సంస్థలు ఆద్వర్యంల అల్పాహారం, మంచినీళ్లు పంపిణీ చేస్తున్నారు.