విశాఖపట్నం
విశాఖ దక్షిణ నియోజకవర్గం, 39 వ వార్డు పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.జీవన ఉపాధి కోసం గత 25 సంవత్సరాలుగా ఉన్న షాపులు అన్యాయంగా జీవీఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారంటూ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆందోళనకు దిగారు. కక్ష్య సాధింపుతో బడ్డీలంటూ తొలిగించాలంటూ జీవీఎంసీ కి స్థానిక వార్డు కార్పొరేటర్ సాదిక్ బడ్డీలు తొలగించాలని పిర్యాదు చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.ఎం.వి డి.ఎం స్కూల్, లక్ష్మీ టాకీస్ దగ్గర జీవీఎంసీ అధికారులు షాపులు తొలగించకుండా 100వైస్సార్సీపీ కార్యకర్తలతో కలసి ఎమ్మెల్యే వాసుపల్లి నిరసన తెలిపారు.