YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కేంద్రంతో కయ్యానికి రెడీ అవుతున్న జగన్

కేంద్రంతో కయ్యానికి రెడీ అవుతున్న జగన్

విజయవాడ, జూలై 21, 
కేంద్రం మీద వైసీపీ గుర్రుగా ఉంది. ఇది ఆ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి మాటలలో స్పష్టంగా తెలిసిపోతోంది. కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపిస్తోందని, ఏపీ పట్ల వివక్ష చూపుతోందని కఠినమైన మాటలనే ఆయన వాడారు. దీనిని బట్టి చూస్తూంటే కేంద్రంతో ఢీ కొట్టాలని వైసీపీ డిసైడ్ అయిందా అన్నదే ఇక్కడ చర్చ. ఇలా ఎందుకు అకస్మాత్తుగా జగన్ నిర్ణయం తీసుకున్నారు అన్నదే ఇక్కడ డౌట్. జగన్ కి ఇపుడు వేరే దారి లేదు. అందుకే కేంద్రం మీద పోరాటానికి ఆయన రెడీ అయిపోయారు అన్న మాట వినిపిస్తోంది.జగన్ రెండేళ్ల ఏలుబడిలో చాలా సహనంతో ఉన్నారు. వీలున్నంతవరకూ అప్పులు చేసుకుంటూ ఏపీ బండిని నడిపించారు. కరోనా వంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినా కూడా కేంద్ర సాయం లేకపోయినా ఏపీలో ఏదో రకంగా సర్దుబాటు చేసుకున్నారు. ఇక జగన్ వల్ల అసలు కావడంలేదు. ఆయన చేయాల్సింది కూడా ఏమీ లేదు. అన్నింటా అప్పులు చేశారు, ఇక అవి వచ్చే దారి కూడా లేదు. కేంద్రమే ఆదుకోవాలి. కానీ కేంద్రం తీరు చూస్తే అసలు ఖాతరు చేయడంలేదు. ఇలా అనేక కారణాలు కలుపుకుని అసహాయత తో కూడా ధర్మాగ్రహంగానే జగన్ ఇపుడు కేంద్రం మీద దండెత్తుతున్నారు అంటున్నారు.నాడు చంద్రబాబు నాలుగేళ్ళ పాటు కేంద్రంతో సావాసం చేసి చివరి ఏడాది మోడీని దుయ్యబెడుతూ బయటకు వచ్చారు. అది వర్కౌట్ కాలేదు. ఎందుకంటే రెండు పార్టీలు చివరి దాకా కలసే ఉన్నాయన్న అభిప్రాయం జనాల్లో బలంగా ఉంది. దాంతో బీజేపీ తప్పులతో పాటు బాబు తప్పులూ ఉన్నాయని జనాలు గట్టిగా నమ్మి ఓడించారు. ఇపుడు జగన్ కేంద్రం మీద తిరగబడాలని అనుకుంటున్నారు. పైగా ఇది రైట్ టైమ్ అని కూడా భావిస్తున్నారు. కేంద్రంతో వైసీపీకి పొత్తు ఏమీ లేదు. పైగా రెండేళ్ళుగా సాయం కూడా ఏమీ చేయలేదు. ఇపుడు బీజేపీ మీద జనాలలో వ్యతిరేకత గట్టిగా ఉంది. అందువల్ల తాను ఎదురుతిరిగితే జనాలు తన వైపే ఉంటారు అన్న లెక్కతోనే జగన్ ఇలా చేశారు అంటున్నారు.ఇక జగన్ కి కేంద్రం అంటే భయం అని టీడీపీ సహా ఇతర విపక్షాలు పదే పదే విమర్శలు చేస్తున్నాయి. జగన్ అది తప్పు అని నిరూపించడానికి కూడా మోడీ తో ఢీ కొడుతున్నారు. దీని వల్ల పోయేది ఏమీ లేదు అన్నది కూడా ఆయన ఆలోచనగా ఉందిట. బెయిల్ రద్దు అయి జైలు కి వెళ్ళినా కూడా జనాల్లో సానుభూతి వస్తుంది, రాజకీయ వేధింపుల ఖాతాలో ఇది జమ అవుతుంది అని కూడా ఆలోచిస్తున్నారుట. మొత్తానికి బీజేపీకి ఎదుర్కోవడానికి ఇదే టైమ్ అని జగన్ అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతుంది. చివరకు సరైన సమయంలో ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఏపీని ఆదుకోవడం లేదు. పైగా కొర్రీలు పెడుతుంది. పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదల నుంచి రాష్ట్ర విభజన అంశాల వరకూ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీనిని జగన్ సీరియస్ గా తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ రెండేళ్ల కాలంలో జగన్ దాదాపు 11 సార్లు ఢిల్లీ వెళ్లివచ్చారు. ఎన్నో వినతులు సమర్పించారు. అన్నింటికీ తన ముందు ఓకే అంటున్నా ఆ తర్వాత చర్యలు మాత్రం శూన్యం.జగన్ కు కూడా ఎన్నికల సమయం దగ్గరపడుతుంది. ప్రధానంగా మూడు రాజధానులను ఏర్పాటు చేయలేకపోయారు. కర్నూలు లో న్యాయరాజధాని ఏర్పాటు కోసం ఢిల్లీ చుట్టు ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం లేదు. వచ్చే ఎన్నికలకు ప్రజల వద్దకు వెళ్లాలంటే ఎలా అని జగన్ సీనియర్ నేతల వద్ద అన్నట్లు సమాచారం. పైగా ఏపీ సెంటిమెంట్ విషయంలోనూ కేంద్రం పట్టువిడుపులగా ఉండటం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వెనక్కు తగ్గడం లేదు. చేసేది కేంద్ర ప్రభుత్వమే అయినా ఎంతో కొంత మూల్యాన్ని జగన్ కూడా చెల్లించుకోవాల్సి వస్తుంది. అదే భయం వైసీపీనేతలను వెంటాడుతుంది.దీనికి తోడు జగన్ సఖ్యతగా ఉంటే కేసుల కోసమే నన్న ప్రచారం విపక్షాలు చేస్తున్నాయి. ఈ రెండేళ్లలో బీజేపీతో సఖ్యతగా ఉండి బావుకున్నదేమీ లేదు. చివరకు రఘురామ కృష్ణరాజు విషయంలోనూ తన వాదనను పట్టించుకోలేదన్న ఆగ్రహంతో జగన్ ఉన్నట్లు తెలిసింది. అందుకే కేంద్ర ప్రభుత్వంలో చేరమని ఇటీవల బీజేపీ వత్తిడి చేసినా జగన్ సున్నితంగా తిరస్కరించారంటారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను అడ్డంపెట్టి మోదీపై యుద్దం ప్రకటించాలని వైసీపీ చీఫ్ జగన్ రెడీ అయినట్లు సమాచారం. తాను కేసులకోసం భయపడబోనని ఆయన నిరూపించుకోదలచుకున్నారు. అందుకే త్వరలోనే మోదీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్ నోటి నుంచి ప్రకటనలు వెలువడే అవకాశముందని తెలుజగన్ అవసరం కేంద్రానికి ఉంది కాబట్టి వారు ఏమైనా తగ్గితే ఏపీ అభివృద్ధి సాధ్యపడుతుంది అన్న మరో ఆలోచన కూడా ఉందని అంటున్నారు. ఏది ఏమైనా ముసుగులు తొలగాయి. ఇక మోడీ పట్ల గట్టిగానే ఉండాలని వైసీపీ నిర్ణయించింది అన్నదే తాజా రాజకీయ కబురుగా ఉంది.

Related Posts