ఏలూరు
జగన్ అసమర్ధ పాలనలో రాష్ట్రం దివాళా తీస్తోంది. జీతాలు కూడా ఇవ్వలేరు, అప్పుల పాలు చేస్తున్నారు. బుగ్గన రాజేంద్ర తన పేరు బొంకు రాజేంద్ర గా మార్చుకుంటే బెటరని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. శుక్రవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. రహస్య జీవో లు ఎన్ని ఉన్నాయి.? ప్రజలకు నిజం చెప్పరా..? పెట్రో ధరల్లో దాదాపు రూ.60 లు సెస్ విధిస్తున్నారు. జగన్ ప్రభుత్వం అప్పులపై స్వేత పత్రం విడుదల చేయాలి. సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభం లోకి నెట్టేస్తున్నారు. చెత్త పైన కూడా పన్నులు పెంచే చెత్త ప్రభుత్వం, చెత్త నాయకత్వమని అన్నారు. అప్పు కోసం మోడీ కాళ్లపైనా, ఎవరి కాళ్లపైన అయినా పడుతున్నారు. సెంటు భూమి ఇచ్చి, పేదలను బురద నీళ్ళల్లో ఇళ్లు కట్టుకోమనడం దౌర్భాగ్యం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పై ఏపీ ప్రభుత్వం మొసలికన్నీరు కారుస్తుందని అయన అన్నారు.