కరీంనగర్
మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేసారు. కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు అయింది. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ కోర్టులో పిటిషన్ దాఖలయిన విషయం తెలిసిందే. ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేసి విచారణ చేయాలంటూ పిటిషనర్ కోర్టును కోరారు. దాంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసారు.