వరంగల్
వరంగల్ లో ఓ తెరాస నాయకుడు వినూత్న రీతిలో కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించి తన అభిమానాన్ని చాటాడు. కేటీఆర్ చిత్ర పటాలను మొక్కలకు అంటించి ఓ నర్సరీలోని మొక్కలన్నీ ప్రజలకు పంచాడు..ఒకరోజు ముందే వరంగల్ లో వెరైటీగా కేటీఆర్ జన్మదిన వేడుకలను మొదలయింది. -ఈ వినూత్న వేడుకలు వరంగల్ లోని శివనగర్ లో జరిగాయి. ఏకంగా నర్సరీలోని మొక్కలన్నీ సేకరించిన కేటీఆర్ నాయకుడు రాజనాల శ్రీహరి కేటీఆర్ పై తన అభిమానాన్ని చాటాడు.
కేటీఆర్ చిత్ర పటాలతో సిద్ధం చేసిన మొక్కలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశాడు. కేటీఆర్ 46వ జన్మదిన కానుక గా తన వీరాభిమానాన్ని చాటుకున్నాడు. 500 మొక్కలు పంపిణీ చేసి పంపిణీ చేసాడు. ముక్కోటి వృక్ష అర్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, ముక్కోటి అర్చన కార్యక్రమాన్ని విజయవంతం చేసి గిన్నిస్ బుక్ రికార్డ్ స్వంతం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. మొక్కలునాటి పర్యావరణాన్ని కాపాడుతూ కాలుష్యాన్ని నివారించడానికి మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఎంపీ సంతోష్ కుమార్ ఏర్పాటు చేయడం జరిగిందని, అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలను కోరారు.