నందిగామ
జగన్మోహన్ రెడ్డి కి ధైర్యం ఉండి, ఇళ్ళ స్థలాల అవినీతిపై సీబీఐ విచారణ వేస్తే 40 మంది ఎమ్మెల్యేలు జైలుకు వెళ్లడం ఖాయమని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. నందిగామ అనాసాగరం లో ఇళ్ళ స్థలాల ముంపునుఅయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ఇతరులు వున్నారు. దేవినేని మాట్లాడుతూ జే - ట్యాక్స్ వేల కోట్ల దోపిడీ కోసం పేదోళ్ళను మోసం చేశారు. లబ్ధిదారులకు రెండు వారాల్లో టిడ్కో ఇల్లు కేటాయించాలని.. లేదంటే ఆగస్టు 15న లబ్ధిదారులు గృహప్రవేశం చేస్తారు. నందిగామ అనాసాగరంలో ఎకరాకు రూ.11లక్షల అవినీతి జరిగిందని అయన అన్నారు.