విశాఖపట్నం
సింహగిరిపై ఆషాడ పౌర్ణమి వేడుక ఘనంగా జరిగింది. పండితులుఅప్పన్న స్వామి కి తుది విడతగా 125 కిలోల సుగంధ చందన సమర్పణ చేసారు. గురుపౌర్ణమి సందర్భంగా పెద్దసంఖ్యలో స్వామి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ దర్శన టికెట్ల విక్రయం జరిగింది. టికెట్ తీసుకున్న ఆఖరి భక్తుని వరకు దర్శనాలు కొనసాగించారు. శనివారం నాడు ఆలయంలో ఈరోజు ఆర్జిత సేవలు రద్దు చేసారు. ముందుగా టికెట్లు తీసుకుని భక్తులకు ఆదివారం దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు.