YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఎవరూ అధైర్యపడొద్దు.. అండగా ఉంటా: మంత్రి కేటీఆర్‌

ఎవరూ అధైర్యపడొద్దు.. అండగా ఉంటా: మంత్రి కేటీఆర్‌

ఎవరూ అధైర్యపడొద్దు.. అండగా ఉంటా: మంత్రి కేటీఆర్‌
సిరిసిల్ల జూలై 26
టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు, కుటుంబాలకు అండగా ఉంటామని.. ఎవరూ అధైర్యపడొద్దని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ భరోసానిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నర్సింహులపల్లికి చెందిన టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు బొంగురపు శ్రీనివాస్‌రెడ్డి.. కొద్ది రోజుల కిందట కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందాడు. సోమవారం బాధిత కుటుంబాన్ని కేటీఆర్‌ పరామర్శించారు. శ్రీనివాస్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి, ధైర్యం చెప్పారు. తక్షణ సహాయంగా రూ.2లక్షల చెక్కును అందజేశారు. శ్రీనివాస్‌ కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అన్ని వేళల కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. గ్రామానికి వచ్చిన మంత్రికి స్థానికులు పెద్ద ఎత్తున వినతిపత్రాలు అందజేశారు.

Related Posts