YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

విఆర్ఏ ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి నామినీలను విఆర్ఏ లుగా నియమించాలి

విఆర్ఏ ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి నామినీలను విఆర్ఏ లుగా నియమించాలి

విఆర్ఏ ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
నామినీలను విఆర్ఏ లుగా నియమించాలి
తుగ్గలి
 రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న గ్రామ రెవిన్యూ సహాయకుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వీఆర్ఏలు డిమాండ్ చేశారు.తుగ్గలి మండలం పరిధిలోని ఉప్పర్లపల్లి గ్రామంలో తుగ్గలి మండల వీఆర్ఏలు పత్తికొండ ఎమ్మెల్యే ను కలిసి తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేతో మాట్లాడుతూ వేతనం రూ. 21,000 లు ఇవ్వాలని,పే స్కేల్ ఇవ్వాలని,నామినీలుగా పనిచేస్తున్న వారందరికీ విఆర్‌ఏలుగా నియమించి, డి.ఎ ను వేతనం నుండి మినహాయించటాన్ని విరమించుకోని,అర్హులైన విఆర్‌ఏ లకు విఆర్ఓలుగా ప్రమోషన్స్ ఇవ్వాలని కోరుతూ జూలై,ఆగష్టు లలో జరగనున్న దశలవారీ ఆందోళనా పోరాటాలను జయప్రదం చేయాలని ఎ.పి. గ్రామ రెవిన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపునిస్తున్నదని వీఆర్ఏలు తెలియజేశారు.

ముఖ్యమంత్రి హామీని నిలబెట్టుకోవాలి : ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి 2017 మార్చి 24న అలంకార్ సెంటర్లో విఆర్ఎ ల ధర్నాకు హాజరై విఆర్పిలకు కనీస వేతనం ఇస్తామని,నామినీలకు న్యాయం చేయటంతో పాటు ఇతర సమస్యలన్ని పరిష్కరిస్తామని నాడు ప్రతిపక్షనేతగా హామి ఇచ్చి ఉన్నారు. వైయస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటినా విఆర్‌ఏలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవటం అన్యాయం. వెంటనే ముఖ్యమంత్రి గారి హామి అమలుకు చర్యలు చేపట్టాలని ఎ.పి. గ్రామ రెవిన్యూ సహాయకుల సంఘం డిమాండ్ చేస్తుందని వారు తెలియజేసారు.

నామినీలకు విఆపలుగా నియమించాలి : రాష్ట్ర వ్యాపితంగా పనిచేస్తున్న విఆర్ఎలలో చాలా
మంది అనారోగ్యంతో,వయస్సు పైబడి విధులు నిర్వర్తించలేక పోవడంతో వారి వారసులు
విఆర్‌ఏల విధులు నిర్వర్తిస్తున్నారు.అనేక సంవత్సరాలుగా నామినీలుగా పనిచేస్తున్న వీరిని విఆర్‌ఏలుగా నియమించాలని కోరుతున్నా, నేటికి సమస్య పరిష్కారం కాలేదు. గత ప్రభుత్వం నామినీలనువిఆర్‌ఏ లుగా నియమించేందుకు ప్రతిపాదనలు తయారు చేసినప్పటికి అనేక కుంటిసాకులు చేబుతూ ఆ ప్రతిపాదనలను ప్రక్కన పెట్టిందని వెంటనే వీఆర్ఏల సమస్యలను పరిష్కారం చేయాలని వారు డిమాండ్ చేశారు.మండల కేంద్రాలలో నిరసనలు,ఆర్డిఓ కార్యాలయం వద్ద నిరసనలు,కలెక్టరేట్ల వద్ద నిరసనలు చేపట్టామని,చివరిగా ఆగస్టు 2,3,4 తేదీలలో విజయవాడలో రాష్ట్ర స్థాయి ధర్నాలను నిర్వహిస్తున్నట్లు వీఆర్ఏలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వీఆర్ఏ లు రమేష్, రామాంజనేయులు, శేఖర్, పులికొండ,చౌడప్ప, తదితరుల వీఆర్ఏలు పాల్గొన్నారు.

Related Posts