హుజురాబాద్
హుజురాబాద్ లో మంత్రి హరీష్ రావు బుధవారం పర్యటించారు. ఈ నేపధ్యంలో హుజురాబాద్ నుండి జమ్మికుంట వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.. బైక్ ర్యాలీగా జమ్మికుంటకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు, మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ చేరుకున్నారు. మంత్రులకు ఘన స్వాగతం పలికేందుకు టీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. ఆయ్యప్ప ఆలయం నుండి గాంధీ చౌరస్తా మీదుగా ఇల్లందకుంట వరకు బైక్ ర్యాలీ సాగింది. జై కేసీఆర్, జై టిఆర్ఎస్, జై హరీష్ రావు నినాదాలతో జమ్మికుంట మారు మోగింది. తరువాత మంత్రి శాలపల్లి లో కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు