హైదరాబాద్
హుజురాబాద్ అభ్యర్థిగా బిసిలకు అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్, మంత్రి గంగులకు బిసి సంఘాల నేతలు కృతజ్ణతలు తెలిపారు. మంత్రి గంగుల కమలాకర్ నివాసంలో బిసి సంఘాల నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రజక, కుమ్మరి,యాదవ, నాయీభ్రాహ్మణ, మేరు, సగర సంఘాల నేతలు హజరయ్యారు. రాబోయే హుజురాబాద్ ఎన్నికల్లో బేషరతుగా టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించారు. బిసిల అభ్యున్నతి కోసం టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న కృషి అభినందనీయం. ఒపెన్ నియోజకవర్గంలో బీసీలకు సీటు కేటాయించడం కేసీఆర్ గారి బిసి పక్షపాతానికి నిదర్శనం. గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు అభినందనలు తెలిపారు.