YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కులం పేరుతో రాజకీయాలు చేసే వారు ఇప్పుడేమంటారు

కులం పేరుతో రాజకీయాలు చేసే వారు ఇప్పుడేమంటారు

కులం పేరుతో రాజకీయాలు చేసే వారు ఇప్పుడేమంటారు
కులం, మతం కాదు మానవత్వముండాలి...!
కడప ఆగస్టు11
కడపలోరెడ్డి కాలనీలోని తన కార్యాలయంలో కడప నగర టీడీపీ అధ్యక్షుడు సానపురెడ్డి శివకొండా రెడ్డి మీడియాతో మాట్లాడారు. అచ్చితా రెడ్డి తాడిపత్రి మండలంలో ఒక పల్లెకు చెందిన యువతి. ఆమె  నాన్నని ఫ్యాక్షన్ ప్రత్యర్థులు చంపేశారు. అలాంటి పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చదివించారు. ఇప్పుడు ఆ అమ్మాయి సివిల్స్ దాకా ఎదిగింది. కులంకులం అని గింజుకునే వాళ్లకు ఇదే కనువిప్పు కావాలని అన్నారు. కులం చూడం. మతం చూడం. పార్టీలు చూడం అని పదేపదే అరిగిపోయిన గ్రామపోన్ రికార్డు లాగా చెప్పేదే కానీ పాటించేది లేదు. చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేది గుడిసెలు అనే చెప్పే నానుడి మాదిరి ఉంది జగన్ రెడ్డి ప్రభుత్వ తీరు అని విమర్శించారు. రాజకీయాలకి కాకుండా మానవత్వానికి విలువ ఇచ్చే పార్టీ ఎదో ఇప్పుడు అర్థమైందా...!  చావుల్ని అడ్డం బెట్టుకుని... బుగ్గలు నిమిరి ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చాక జగన్ రెడ్డి మాట, మడమే కాదు ఫుల్ టర్న్ ఇచ్చేశాడని అన్నారు. చంద్రబాబు నాయుడు ఆరడుగుల నాయకుడే కాదు...వ్యక్తిత్వానికి నిలువుటద్దమని అన్నారు. ఈ సమావేశంలో నగర ప్రధాన కార్యదర్శి జలతోటి జయకుమార్, నగర డివిజన్ ఇన్ఛార్జ్ సజ్జా సాయి పాల్గొన్నారు.

Related Posts