కెసిఆర్ దత్తత గ్రామం వాసాలమర్రి గ్రామంలో బీడీ కార్మికులకు పెన్షన్ అందజేత
యదాద్రి భువనగిరి ఆగష్టు 13
ముఖ్య మంత్రి కెసిఆర్ దత్తత గ్రామం వాసాలమర్రి గ్రామాభివృద్ధి సంక్షేమంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతారెడ్డి .మండలంలోని వాసాలమర్రి గ్రామంలో 35మంది బీడీ కార్మికులకు మంజూరైన పెన్షన్ డబ్బులను శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూఈనెల 4న సీఎం కేసీఆర్ వాసాలమర్రి గ్రామంలో రెండవసారి పర్యటించి ఇంటింటా తిరిగి ప్రజల ఆర్థిక స్థితిగతులను స్వయంగా పరిశీలించారన్నారు. బీడీ కార్మికులు సీఎం కేసీఆర్ ను ఫించన్ ఇవ్వాలని కోరిన వెంటనే గ్రామంలోని ఆర్హులైన 35మంది లబ్ధిదారులకు ఫించన్లు మం జూరు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఆలేరు నియోజక వర్గంలో బీడీ కార్మికులు అధికంగా ఉన్నారన్నారు.