YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మృతి చెందిన మత్స్యకార కుటుంబాలను ఆదుకుంటాం రాష్ట్ర మత్స్యశాఖ, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు

మృతి చెందిన మత్స్యకార కుటుంబాలను ఆదుకుంటాం రాష్ట్ర మత్స్యశాఖ, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు

మృతి చెందిన మత్స్యకార కుటుంబాలను ఆదుకుంటాం
రాష్ట్ర మత్స్యశాఖ, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు
చేపల వేటకు వెల్లి ముగ్గురు జాలర్లు మృతి విచారకరం
మృతుల కుటుంబానికి ప్రభుత్వం అన్ని విదాలా ఆదుకుంటుంది
మృతదేహాలను వెలికి తీసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం
స్థానిక ఎమ్మెల్యే, అధికారుల తో మాట్లాడిన మంత్రి
పలాస
శ్రీకాకుళం జిల్లా గార మండలంలో విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో చేపల వేటకు వెల్లిన  మత్స్యకారుల్లో ముగ్గురు మత్స్యకారులు గల్లంతయ్యారు. వీరు గార మండలంలోని బందరువానిపేట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు స్పందించారు.  వెంటనే జిల్లా అధికారులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి సీనియర్ నాయకులు ధర్మాన ప్రసాదరావుతో సంబందిత విషయం మాట్లాడి ప్రభుత్వం నుండి మృతుల కుటుంబ సభ్యులకు ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మత్స్యకారులకు ఏ ప్రమాదం జరిగినా నేను ఉన్నాను అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందిస్తారని అన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుని విచారాన్ని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు మత్స్యకారుల పట్ల నిర్లక్ష్యం వహించడంతో ఇలాంటి ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక జిల్లాకి ఒక హార్బర్ మంజూరు చేసి చేపల వేటకు అనుకూలం కల్గిస్తున్నారాని తెలిపారు. మత్స్యకారుల జీవితాలు సముద్ర  అలలకు బలైపోయి తల్లి గర్భం శోక సముద్రంలో మునిగిపోతుందని ఆవేదన చెందారు. మత్స్యకారుల కష్టాలను తీర్చేందుకు అహర్నిశలు శ్రమిస్తామని హామి ఇచ్చారు. మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకునేలా చర్యలు తీసుకుంటుందని హామి ఇచ్చారు. జిల్లా అధికారులతో పోన్ లో మాట్లాడి అన్ని విదాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మత్స్యకారుల గల్లంతు విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెల్లి వీలైనంత త్వరగా వారిని ఆదుకుంటని అన్నారు.  పుక్కల్ల గన్నయ్య, గణేష్ తండ్రీ కొడుకులు కాగా అదే గ్రామానికి  చెందిన రాయితి పెదరాయుడు లు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు.

Related Posts