సింగరేణిలో ప్రమాదం..ముగ్గురు మృతి
భద్రాద్రి కొత్తగూడెం
మణుగూరు సింగరేణి ఓసి2లో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. బొలెరో వాహనం పైకి డంపర్ ఎక్కడంతో ప్రమాదం జరిగినట్లు కార్మికులు చెబుతున్నారు. చనిపోయిన వారు పాషా, సాగర్ ,డ్రైవర్ వెంకన్నగా సిబ్బంది గుర్తించారు. అయితే సింగరేణి అధికారులు ధృవీకరించలేదు.