YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వర్శిటి గెస్ట హౌస్ లో శోభనం

వర్శిటి గెస్ట హౌస్ లో శోభనం

వర్శిటి గెస్ట హౌస్ లో శోభనం
కాకినాడ, ఆగస్టు 21, 
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జేఎన్టీయూ వర్శిటీ సిబ్బంది తీరుపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. జేఎన్టీయూ గెస్ట్‌హౌస్‌లో ఏకంగా శోభనం జరిపించడం కలకలంరేపింది. ఓ గదిలో నూతన వధువరులకు శోభనం తంతు నిర్వహించారట. ఈ నెల 18 న యూనివర్శిటీకి చెందిన మహిళ సాధికారత డైరెక్టర్ పేరు మీద 201 రూమ్ బుక్ చేసినట్లు తెలుస్తోంది. సరస్వతి‌ నిలయంగా చెప్పుకునే విద్యాలయంలో ఇలాంటి చర్యలపై యూనివర్సిటీ విద్యార్ధులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై వర్శిటీ సిబ్బంది స్పందించాల్సి ఉంది. వెంటనే ఈ ఘటనపై స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.సాధారణంగా ఇతర ప్రాంతాల నుంచి యూనివర్సిటీ వ్వవహారాల నిమిత్తం ఇక్కడికి వచ్చే అధికారులు,సిబ్బందికి ఈ గదులను అద్దెకు ఇస్తుంటారు. ప్రైవేట్ కార్యకలాపాలకు ఇవ్వకూడదు.. విద్యార్థులు చదువుకునే యూనివర్సిటీలో ఇలాంటి ప్రైవేట్ కార్యక్రమాలు నిర్వహించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై యూనివర్సిటీ అధికారుల్నివివరణ కోరగా.. దీనిపై ఒక కమిటీ వేసి విచారణకు ఆదేశిస్తామన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Related Posts