నిర్మల్
ఆ పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. పెళ్లికూతురు, పెళ్లికూతురు తండ్రి మృతి చెందడంతో కుటుంబికులు, బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు. కడెం మండలం మద్దిపడగా గ్రామానికి చెందిన మౌనిక కు, మహారాష్ట్ర, బల్లర్ష రాజురా గ్రామానికి చెందిన వ్యక్తితో ఈనెల 25 తేదీన వివాహం జరిగింది. శుక్రవారం రాత్రి మహారాష్ట్ర బల్లర్శలో రిసెప్షన్ ముగించుకొని తిరిగివస్తుండగా రాత్రి సుమారు ఒంటి గంట ప్రాంతంలో కడెం మండలం పాండవపూర్ గ్రామసమీపంలోని వంతెన పై అదుపు తప్పి బ్రిడ్జి లోయలో కారు పడింది. ఘటనలో పెళ్లి కూతురు మౌనిక, పెళ్లికూతురు తండ్రి రాజయ్య అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి.