YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

భక్తియే ముక్తికి సోపానం

భక్తియే ముక్తికి సోపానం

భక్తియే ముక్తికి సోపానం  
ఎమ్మిగనూర్
పట్టణంలో గీతా మందిరం లో మానవునిలోని అరిషడ్వర్గాలను పారద్రోలి, సన్మార్గాన నడిపింప చేసేది భక్తి మార్గం మాత్రమేనని,చిన్మయ మిషన్ అనంతపురం జిల్లా శాఖ బాధ్యులు స్వామిని ప్రతిష్టానంద సరస్వతి మాతాజీ అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గత మూడు రోజుల నుండి ఎమ్మిగనూరు గీతామందిరం నందు జరుగుతున్న ధార్మిక ప్రవచనాలు, భజనలు, గోపూజ, కుంకుమార్చన కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరించాయి. మూడు రోజుల పాటు మాతాజి రామాయణ, భారత, భగవధ్గీత ప్రవచనం చేశారు.  
శుక్రవారం ఉదయం గోపూజ, కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈసందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి మాట్లాడుతూ ముక్కోటి దేవతలను పూజించిన పుణ్యఫలం గోవులకు సేవచేస్తే కలుగుతుందని, గోజాతి రక్షణకోసం తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ గ్రామంలోని దేవాలయం కేంద్రంగా చేసుకుని ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని అన్నారు.   ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు గీతా మందిర్ అధ్యక్షులు ఏం నాగరాజు యం లక్ష్మన్న ఓబుళపతి రిటైర్డ్ ఎ.ఎస్.పి పెద్దయ్య,గీతామంందిర్ కార్యదర్శి ఉరుకుందప్ప, ఎస్ శివ దాస్ పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Related Posts