YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రోశయ్య సేవలు మరువలేనివి

రోశయ్య సేవలు మరువలేనివి

రోశయ్య సేవలు మరువలేనివి
నల్లగొండ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సీఎం రోశయ్య మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మాజీ మంత్రి జానారెడ్డి. క్యాబినెట్ మంత్రిగా ఆయనతో  ఉన్న చిరకాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు జానా రెడ్డి. పరిపాలనా అంశాల్లో, వివిధ కమిటీలలో ఆయనతో పని చేసిన కాలంలో చాలా విషయలు నేర్చుకున్నానని జానారెడ్డి తెలిపారు.  ఆర్థికమంత్రిగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో రోశయ్య తన ప్రత్యేకతను చాటుకున్నారు అని జానారెడ్డి అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా, తమిళనాడు రాష్ట్ర గవర్నర్ గా  రోశయ్య చేసిన సేవలు మరువలేనివని జానారెడ్డి అన్నారు. ఉన్నత విలువలు కలిగిన రోశయ్య రాజకీయాల్లో విలువలు పాటించే వ్యక్తి అని ఆయన నేటి తరం రాజకీయ నాయకులకు ఆదర్శం అని జానారెడ్డి పేర్కొన్నారు.

Related Posts