YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లపై సీఎం సమీక్ష

ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లపై సీఎం సమీక్ష

అమరావతి
ధాన్యం సహా పంటల కొనుగోళ్లపై ఆహార పౌరసరఫరాల శాఖ, వ్యవసాయశాఖ అధికారులతో క్యాంప్ కార్యాలయంలో సీఎం  వైయస్.జగన్ మోహన్ రెడ్డి సమీక్ష జరిపారు. సీఎం మాట్లాడుతూ పంటల కొనుగోళ్లలో ఆర్బీకేలు క్రియాశీల పాత్ర పోషించాలి.  కచ్చితంగా రైతుకు కనీస ఎంఎస్పీ ధర లభించాలి. రైతులందరికీ ఎంఎస్పీ రావడం అన్నది మన ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్యం దిశగా ఆర్బీకేలు, అధికారులు కృషిచేయాలి. రైతులకు సేవలందించడంలో ఎలాంటి అలసత్వం ఉండకూడదని అన్నారు.
ఎక్కడా కూడా సమాచార లోపం ఉండకూడదు. తరచుగా రైతులతో ఇంటరాక్ట్ అవ్వాలి. రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి గతంలో ఎవ్వరూ ముందుకు వచ్చిన సందర్భాలు లేవు. రైతులకు తోడుగా నిలవడానికి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నాం. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు. కొనుగోలు తర్వాతే మిల్లర్ల పాత్ర ఉండాలి. ధాన్యం నాణ్యతా పరిశీనలో రైతులు మోసాలకు గురికాకూడదు. ఇతర దేశాలకు నేరుగా ప్రభుత్వంనుంచే ఎగుమతులు చేసేలా చూడాలి. దీనివల్ల రైతులకు మేలు జరుగుతుంది. కొనుగోలు కోసం ఆర్బీకేలో ఐదుగురు సిబ్బంది కేటాయించాలి. ధాన్యం, పంటల కొనుగోలు కోసం ప్రతి ఆర్బీకేలో కూడా కనీసంగా ఐదుగురు సిబ్బంది ఉండాలి. టిక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇతర సిబ్బంది ముగ్గురు కచ్చితంగా ఉండాలి. ప్రతి ఆర్బీకేలో కూడా కేటగిరీతో సంబంధం లేకుండా ఐదుగురు సిబ్బంది ఉండాలని అన్నారు.
వీళ్లే రైతుల దగ్గరకు వెళ్లి.. వారితో ఇంటరాక్ట్అయ్యి.. కొనుగోలుకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయాలి. గన్నీబ్యాగులు, రవాణా వాహనాలు, అవసరమైన హమాలీలను ఈ ఐదుగరు సిబ్బందే ఏర్పాటు చేయాలి . వీటికోసం రైతులు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండకూడదు.  21 రోజులలోగా పేమెంట్స్ కావాలి. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో వారికి పేమెంట్లు అందేలా తగిన చర్యలు తీసుకోవాలి. దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలి. పేమెంట్లు ఆలస్యం కాకుండా చూడాల సీఎం ఆదేశించారు.
పంటల కొనుగోలు సంబంధిత సమస్యలపై ఫిర్యాదులు, విజ్ఞాపనల కోసం ప్రతి ఆర్బీకేలో ఒక నంబర్ను పెట్టాలి. ఆ నంబర్కు వచ్చే ఫిర్యాదులను సీరియస్గా తీసుకోవాలి.క్షేస్థాయి పర్యటనలు జరిపి రైతులు చెప్పే సమస్యలను వినాలి. దీనివల్ల సమస్యల తీవ్రతతో పాటు పరిష్కార మార్గాలు లభిస్తాయి. రైతులతో ఇంటరాక్షన్, నిరంతర చర్చలు అధికారులు జరపాలని అన్నారు.
ప్రత్యామ్నాయ సాగు – ప్రోత్సాహం
రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుచేసేలా వారిలో అవగాహన కల్పించండని సీఎం అన్నారు. ఇలా పంటలు పండించే వారికి ప్రత్యేక బోనస్ ఇచ్చే అంశాన్ని అధికారులు పరిశీలించాలి. ప్రత్యామ్నాయ పంటలు పండించేలా కార్యాచరణ సిద్ధంచేయండి. ప్రత్యామ్నాయ పంటల కొనుగోలు బాధ్యతను కూడా ప్రభుత్వమే చేపుతుందన్న విషయాన్ని రైతులకు తెలియజేయండి. రైతులకు మంచి ఆదాయాలు కల్పన దిశగా చర్యలు తీసుకోవాలని అయన అన్నారు.
ఈ సమీక్షా సమావేశానికి వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఆహార పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని), సీఎస్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి వై మధుసూధనరెడ్డి, సివిల్ సఫ్లైస్ కమిషనర్ ఎం గిరిజాశంకర్, వ్యవసాయశాఖ కమిషనర్ హెచ్ అరుణ్కుమార్, అగ్రికల్చర్ మార్కెటింగ్ శాఖ కమిషనర్ పీ ఎస్ ప్రద్యుమ్న,  సివిల్ సఫ్లైస్ డైరెక్టర్ ఎస్ డిల్లీరావు, సివిల్ సఫ్లైస్ ఎండీ జీ వీరపాండ్యన్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Related Posts