YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సంక్రాంతి.. ఫుల్ రష్

సంక్రాంతి.. ఫుల్ రష్

విజయవాడ, డిసెంబర్ 24,
పండగలు పబ్బాలు వచ్చాయంటే సిటీలో ఉద్యోగాలు చేస్తున్న వారంతా ఇంటి బాట పడుతూ ఉంటారు. ముఖ్యంగా పండగల సీజన్ వచ్చింది అంతే చాలు సొంతూళ్ళకు వెళ్లే వారికి కష్టాలు మొదలు అవుతాయి. ఏ బస్సు ఎక్కినా కిక్కిరిసిపోయే జనాలు ఉంటారు. ఇక సంక్రాంతి పండగకు కూడా పరిస్థితులు అలాగే ఉంటాయట. పండగకు 20 రోజులు వుండగానే ఇప్పటికే జనవరి 7-14 మధ్యన రైళ్లు, బస్సుల్లో సీట్లన్నీ బుక్ అయిపోయాయట.ఇక హైదరబాద్ మరియు విజయవాడ నుండి వైజాగ్ వెళ్లే రైళ్లకు బస్సులకు డిమాండ్ ఎక్కువగా ఉండగా రైళ్లలో అయితే వెయిటింగ్ లిస్టు దాటిపోయి రిగ్రెట్ వస్తుందట. అయితే హైదరాబాద్ కు వెళ్ళే రైళ్లలో మాత్రం బెర్తులు కాళిగా ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో స్పెషల్ రైళ్లు వేస్తారా అని ప్రయాణికులు ఆశిస్తున్నారు..దీనిపై రైల్వేశాఖ, ఆర్టీసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. తెలుగువారికి అతి పెద్ద పండగ.. సంక్రాంతి.. దీంతో సంక్రాంతి వస్తుంటే.. నగర ప్రజలు పల్లె బాట పడతారు. తమ కుటుంబ సభ్యులతో సంక్రాంతి పండగను సంతోషంగా గడపాలని ఇంటికి వెల్దామనుకుంటారు. అటువంటి వారికి ప్రయాణం చేయడంలో అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా రైళ్లు, బస్సుల్లో రద్దీ నెలకొంటుంది. ఇప్పటికే జనవరి 7నుంచి జనవరి 14వరకూ ముందస్తు రిజర్వేషన్లతో రైళ్లలో, బస్సుల్లో బెర్తులు, సీట్లు ఫుల్ అయ్యాయి. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ లో హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ వైపు వెళ్లే రైళ్లకు, బస్సులకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ట్రైన్స్ లో అయితే కనీసం కాలు పెట్టె పరిస్థితి కూడా ఉండదు. వెయిటింగ్ లిస్ట్ కూడా భారీగా ఉంది. దీంతో దక్షిణ మధ్య రైల్వేశాఖ స్పెషల్ రైళ్లను ఏర్పాటు చేసింది.హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి వెళ్లే గోదావరి జిల్లాల బస్సులతో పాటు, ఉత్తరాంధ్రవైపు వెళ్లే బస్సుల రిజర్వేషన్ ఇప్పటికే పూర్తి అయింది. జనవరి 8 నుంచి 14వ తేదీల మధ్య విశాఖపట్నం మీదుగా వెళ్లే విజయనగరం, శ్రీకాకుళం వెళ్లే ఆర్టీసీ బస్సుల రిజర్వేషన్ ఇప్పటికే పూర్తి అయింది.  ఇప్పటికే రెగ్యులర్‌ బస్సుల్లో సీట్లు ఫుల్‌ అవుతుండడంతో.. ఇక స్పెషల్‌ సర్వీసులకు రిజర్వేషన్ కు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.కరోనా తగ్గుముఖం పడుతుందంటూ కరోనా నిబంధనలు అనుసరిస్తూ.. ప్రయాణీకులు సురక్షితంగా ప్రయాణం చేసేలా ఏపీఆర్టీసీ సంక్రాంతికి స్పెషల్ బస్సులను ఏర్పాటు చేస్తోంది. సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కృష్ణా రీజియన్‌ నుంచి 1,266 ప్రత్యేక బస్సులను నడపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌కు 362, విశాఖపట్నానికి 390, రాజమండ్రికి  360,చెన్నైకి 20, బెంగళూరుకు 14, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు 120 బస్సులను నడపనున్నారు.రోజూ విజయవాడ నుంచి విశాఖపట్నం మీదుగా నిత్యం 85 ట్రైన్స్ కు పైగా ప్రయాణిస్తున్నాయి. అయితే రత్నాచల్‌,  సింహాద్రి,  జన్మభూమి రైళ్లలో రిజర్వేషన్ కు ఆకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం కొన్ని సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. మిగిలిన అన్ని ట్రైన్స్ అడ్వాన్స్ బుకింగ్ తో బుక్ అయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రకు వెళ్లేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. దీంతో ముందస్తు రిజర్వేషన్లతో ట్రైన్స్ ఫుల్ అయ్యాయి.

Related Posts