YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్య…బంధువుల అందోళన

బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్య…బంధువుల అందోళన

మహబూబాబాద్
డీసీసీ బ్యాంక్ ఛైర్మెన్ వేదింపులు భరించలేక ఓ దళిత ఉద్యోగి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా  కేసముధ్రం మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన అన్నేపాక రామచంద్రయ్య 25 సంవత్సరాలుగా దన్నసరి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బ్యాంక్ లో అటెందర్ గా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజు మాదిరిగానే బ్యాంక్  లో విధులు నిర్వహించడం కోసం వెళ్ళిన రామచంద్రయ్య ఇంటికి రాలేదు. ఫోన్ లో పురుగుల మందు తాగానని కుటుంబ సభ్యులకు పాన్ ద్వారా సమాచారమిచ్చారు.  కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి రామచంద్రయ్య మృతి చెందాడు. బ్యాంకులో తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వాలంటూ బ్యాంకు ఛైర్మెన్ మర్రి రంగారావు,  సీఈఓ మల్లారెడ్డి లు గత కొద్ది రోజులుగా వేధింపులకు గురి చేస్తున్నారని, ఈరోజు కూడా డబ్బులు తీసుక రావాలని వేధించారని వీరి వేదింపులు భరించలేక మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని వీరిపై చర్యలు తీసుకొని మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని మృతుని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Related Posts