YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బోలేరో ట్రాలీ పల్టీ…ఇద్దరు మహిళల మృతి

బోలేరో ట్రాలీ పల్టీ…ఇద్దరు మహిళల మృతి

భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  కరకగుడెం మండలం రెగళ్ళ వద్ద బోలేరో ట్రాలీ వాహనం పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు.  మరో ఇరవై మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను భద్రాచలం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతులు స్వర్ణలత(తాడ్వాయి మండలం వీరపురం), తాటి సమ్మక్క(గుండాల)కు చెందిన వారిగా గుర్తించారు. మర్కొడు పంచాయితీ పరిధిలోని లోద్దిగుడెంలో గుడికి వెళ్లి వస్తుండగా ఘటన జరిగింది. వాహన అతివేగమే ప్రమాదానికి కారణమని క్షతగాత్రులు అంటున్నారు.

Related Posts