YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

డంపింగ్ యార్డు తొలగించాలని ధర్నా

డంపింగ్ యార్డు తొలగించాలని ధర్నా

సికింద్రాబాద్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధి తిరుమలగిరి లో ఉన్న గాంధీ కమిటీ హాల్ ను  గత 6 సంవత్సరాలుగా డంపింగ్ యార్డ్ గా మార్చి రోజు చెత్త వేయడం జరుగుతుంది. ఇక్కడి స్థానికులు ఆ దుర్వాసన ను భరించలేక మంగళవారం ఉదయం ధర్నా కార్యక్రమం చేపట్టారు. గతంలో స్థానిక అధికారులు ఇక్కడి డంపింగ్ యార్డ్ ను ఇక్కడి నుండి తొలగిస్తామని వాగ్దానం చేసి ఇంతవరకు తొలగించలేదని వాపోయారు. ఈరోజు స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి చెత్త లారీలను లొపలికి వెళ్లకుండా గేట్ ముందు బైఠాయించారు. అధికారులు వచ్చి 4 రోజుల్లో ఇక్కడి చెత్త డంపింగ్ యార్డ్ ను తరలిస్తామని అలాగే గాంధి కమిటీ హల్ ను కూడా పునరుద్దరిస్తామని తెలిపారు. వారి మాట ప్రకారం ధర్నా విరమించారు. ఒకవేళ 4 రోజుల్లో డంపింగ్ యార్డ్ ను ఇక్కడి నుండి తరలించకపోతే మళ్ళీ ధర్నా చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ సీఈఓ  అజిత్ రెడ్డి, బోర్డ్ మెంబర్ శామ్  కుమార్,మర్రి రాజశేఖర్ రెడ్డి, జక్కుల మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts