YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఇద్దరు విద్యార్దుల ఆత్మహత్య

ఇద్దరు విద్యార్దుల ఆత్మహత్య

తిరుపతి
ఇద్దరు విద్యార్థులు వేరు వేరు ఘటనల్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.  పద్మావతి జూనియర్ కళాశాల రెండవ అంతస్తులోని రూమ్ నెంబర్ 203 లో ఘటన జరిగింది. మృతురాలు  చిత్తూరు జిల్లా కె.వి పల్లి మండలం గర్నిమిట్ట  కు చెందిన విష్ణు ప్రియ(17) గాపోలీసులు గుర్తించారు. కువైట్ లో కూలిపనులకు వెళ్లిన సరస్వతి,గోవిందు దంపతుల కు ముగ్గురు సంతానం కాగా రెండవ కుమార్తె విష్ణుప్రియ.  ప్రేమ వ్యవహారంలో కుటుంబ  పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేశారని మనస్తాపం గురై ఆత్మహత్య చేసుకుందని అనుమానిస్తున్నారు.  మృతదేహాన్ని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.
మరో ఘటనలో ఐదవ అంతస్తు నుండి దూకి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.  తిరుపతి వెస్ట్ చర్చ్ సమీపంలోని బీసీ హాస్టల్ వద్ద ఘటన జరిగింది. మృతుడు చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలంలోని భీమ గాని పల్లి కు చెందిన నాగేంద్ర కుమార్.  ప్రేమించిన అమ్మాయి దూరమవుతుందని మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.  విశ్వనాథ్,రేణుక దంపతుల ఒక్కగా నొక్క మగ సంతానం నాగేంద్ర. మృతదేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.

Related Posts