భద్రాద్రి
భద్రాద్రి కొత్త గూడెం జిల్లా గుప్త నిధుల లభ్యం కలకలం రేపింది. చర్ల మండలంలోని చర్ల లో గుప్త నిధుల లభ్యం వార్త దావానంలా వ్యాపించింది. గుప్త నిధులు ఉన్న పెట్టె దొరికిందని ప్రచారం జరుగుతోంది. చర్ల పాతచర్ల లోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఆంజనేయు స్వామి ఆలయం పక్కన ఇంటి నిర్మాణం కోసం ఓ వ్యక్తి కూలీలతో పునాదులు తవ్విస్తున్న సమయంలో శబ్దం రావడంతో ఇంటి యజమాని అర్ధాంతరంగా పనులు ఆపివేసాడు. కూలీలను ఇంటికి పంపి ఇంటి యజమానులే తవ్వకాలు జరిపి గుప్త నిధుల పెట్టెను మాయం చేశారని వదంతులు వచ్చాయి. ఈ సంఘటన జరిగి మూడు రోజులు కావస్తున్నా చాలా గోప్యంగా ఉంచినట్లు సమాచారం. పోలీసుల విచారణలో గుప్త నిధుల అసలు రహస్యం వీడనుంది. పోలీసులు అదుపులో గుప్త నిధులు వెలికితీసిన యజమాని, కూలీలు వున్నారు.