యాదాద్రి
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారిని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తరాధికారి స్వాత్మా నందేంద్ర సరస్వతి స్వామీ మంగళవారం నాడు దర్శించుకున్నారు. గర్భగుడిలో స్వామివారి కి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రదానాలయ నిర్మాణాలను స్వామిజీ పరిశీలించారు. ఆలయ ఉద్గాటన తర్వాత యాదాద్రీశుడిని దర్శించుకున్న మొట్టమొదటి పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామివారు స్వామిజీకి ఆలయ ఆర్చకులు, ఈవో గీతా రెడ్డి పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అంతకుముందు స్వామిజీ . విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకుని ..అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా యాదగిరిగుట్టకు వచ్చారు.