YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేసీఆర్ తో తెగదెంపులు

కేసీఆర్ తో తెగదెంపులు

హైదరాబాద్, ఏప్రిల్ 25,
తెలంగాణ కాంగ్రెస్‌లో పీకే కిరికిరి ఓవైపు నడుస్తూనే ఉంది. అయితే కేసీఆర్‌-పీకే భేటీపై రేవంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు మీడియాతో చిట్‌చాట్‌ చేసిన రేవంత్‌.. కేసీఆర్‌తో తెగదెంపుల కోసమే నిన్న పీకే కలిశారన్నారు. ఓడిపోతున్నామనే భయంతో సీఎం కేసీఆర్‌ వ్యూహకర్తలను ఆశ్రయిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎవరితోనూ పొత్తులుండవని ఇప్పటికే రాహుల్‌ స్పష్టంగా చెప్పారని.. మే 6న ఇదే అంశాన్ని రాహుల్‌ బహిరంగసభలో మరోసారి చెప్తారన్నారు. పీకే వ్యవహారం అధిష్టానం చూసుకుంటుందన్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌. పీకే ఏ వ్యూహంతో కేసీఆర్‌ను కలిశారో నాకు తెలియదన్నారు. తెలంగాణలో మేం బలంగా ఉన్నామన్న వీహెచ్‌…పొత్తులు అవసరం లేదన్నారు.టీఆర్ఎస్‌తో తెగదెంపులు చేసుకునేందుకే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ కేసీఆర్‌ను కలిశారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌తో పీకే భేటీపై సోమవారం మీడియతో మాట్లాడుతూ.. ఇక ప్రశాంత్ కిషోర్‌కు టీఆర్ఎస్‌కు ఎలాంటి సంబంధం ఉండదని అన్నారు. ఐప్యాక్‌కు పీకేకు ఇక ఎలాంటి సంబంధం ఉండదని తెలిపారు. తాను ముందు నుంచి చెప్పిందే ఇప్పుడు జరిగిందని పేర్కొన్నారు.పీకే కాంగ్రెస్‌లో చేరాక తెలంగాణ రాష్ట్రానికి వచ్చి.. తనతో కలిసి ఉమ్మడి ప్రెస్‌మీట్ కూడా పెట్టే రోజు దగ్గరలోనే ఉందని తెలిపారు. ఆ రోజు పీకే స్వయంగా టీఆర్ఎస్‌ను ఓడించండని ఆయన నోటి నుంచి చెప్పడం మీరు వింటారని పేర్కొన్నారు. పీకే కాంగ్రెస్‌లో చేరాక ఆయనకు పార్టీ అధిష్టానం మాటనే ఫైనల్‌గా ఉంటుందని తెలిపారు.తెలంగాణలో కాంగ్రెస్‌-టీఆర్‌ఎస్‌ కలిసి పోటీ చేస్తాయన్న బీజేపీ విమర్శలను తీవ్రంగా ఖండించారు పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి. బీజేపీ తోనే టీఆర్‌ఎస్‌కు రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. గతంలో టీఆర్‌ఎస్‌తో ఉన్న లావాదేవీలను రద్దు చేసుకోవడానికే కేసీఆర్‌తో ప్రశాంత్‌ కిశోర్‌ భేటీ అయ్యారని అన్నారు జగ్గారెడ్డి.
ఒంటరి పోరు
తెలంగాణలో కాంగ్రెస్ కు కచ్చితంగా పూర్వవైభవం వస్తుందని ఆ పార్టీ నేత వి.హన్మంతరావు స్పష్టం చేశారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందని అన్నారు. ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలవకముందే ఢిల్లీ లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారని.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తో చర్చలు జరిపారని వెల్లడించారు. ప్రశాంత్ కిశోర్ వారితో కలవకుండా నేరుగా కేసీఆర్‌తో కలిస్తే అనుమానాలు వచ్చేవని వ్యాఖ్యానించారు. పీకే ఏ వ్యూహంతో కేసీఆర్ ను కలిశారో తెలియదన్న హన్మంతరావు.. మాణిక్యం ఠాకూర్ ట్విట్ పై తాను కామెంట్స్ చేయనని పేర్కొన్నారు. ఆయన ఏ ఉద్దేశ్యంతో చేసినా అందులో ఏదో ఒక బలమైన కారణం ఉంటుందని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉందని, ఎవరితోనూ పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయం మేరకు అందరం కలిసి పని చేస్తామని వివరించారు.ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌   ఇటీవల ఏఐసీసీ నేతలతో వరుసగా చర్చలు నిర్వహించారు. సోనియా గాంధీతో వరుసగా సమావేశమవుతూనే.. మరోవైపు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ కావడం తెలంగాణ కాంగ్రెస్‌లో అయోమయ పరిస్థితికి దారితీసింది. ఇటు కాంగ్రెస్‌తో జట్టు కడుతూనే.. సీఎం కేసీఆర్‌తో రాజకీయ ఒప్పందం కుదుర్చుకోవడం ప్రస్తుతం టీపీసీసీ నేతలను ఇరకాటంలో పడేసినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పీకే టీఆర్ఎస్ కోసం పనిచేస్తే.. అది కాంగ్రెస్‌పై ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ వచ్చే ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీతో రాష్ట్ర నేతలు సమావేశమయ్యారు. దీంతోపాటు వచ్చే నెల 6, 7 తేదీల్లో రాహుల్‌ రాష్ట్రంలో పర్యటించనున్నారు.

Related Posts